
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని, తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని చెప్పిన ట్రంప్ నేడు ఆదేశంపై మరోసారి ఫైర్ అయ్యారు. ఇరాన్ యుద్ధం చివరి అంకానికి చేరుకుందని, ఆ దేశం భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. వైట్హౌస్లో జరిగన ఉమెన్ హిస్టరీ మంత్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఏది చేయాలో అదే చేస్తున్నామని తెలిపారు.















