Namaste NRI

కేంద్రం శుభవార్త…రాష్ట్రం మారినా రీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు

వ్యక్తిగత వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేకుండా బిహెచ్‌ (రిజిస్ట్రేషన్‌) భారత రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ రిసీస్‌ను తీసుకు వచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాదారులు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం తప్పుతుంది. ఈ మేరకు తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు/ సంస్థల ఉద్యోగులు (ఆయా కంపెనీలు నాలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తుండాలి) ఈ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా  తమ వాహనాలను సులువుగా తీసుకెళ్లేందుకు వీలు పడుతుందని పేర్కొంది.

                ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్టర్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలలు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించుకునే వీలుంది. ఒక వేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే వాహనాన్ని గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం బిహెచ్‌ సిరీస్‌ను తీసుకువచ్చింది. కేంద్రం ఈ నెల 26న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రూ.10 లక్షల వరకు ధర ఉండే బిహెచ్‌ సిరీస్‌ నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రిజిస్ట్రేషన్‌ సమయంలో 8 శాతం పన్ను  ఉంటుంది. అదే రూ.10`20లోపు వాహనాలకు 10 శాతం, రూ.20 లక్షలకు పైగా ధర ఉండే వాహనాలకు 12 శాతం పన్ను ఉంటుంది. డీజిల్‌ వాహనాలకైతే 2 శాతం ఎక్కువ. ఎలక్ట్రిక్‌ వాహనాలయితే 2 శాతం తక్కువ చార్జి వసూలు చేస్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events