Namaste NRI

అంగరంగ వైభవంగా కింగ్‌ చార్లెస్‌ పట్టాభిషేకం

 బ్రిటన్‌  తదుపరి రాజుగా కింగ్‌ చార్లెస్‌ ప్రమాణం చేయనున్నారు. ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్‌ ఎలిజిబెత్‌-2 గతేడాది సెప్టెంబర్‌లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్‌ తదుపరి రాజుగా ఛార్లెస్‌-3  బాధ్యతలు చేపట్టారు. అయితే, అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ, సంప్రదాయంగా నిర్వహించే పట్టాభిషేకం మాత్రం మే 6న జరగనుంది. ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా వెళ్లాయి.

కాగా, రాజు పట్టాభిషేకానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మిలియన్‌ పౌండ్లు ఖర్చుపెడుతున్నట్లు అంచనా. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1020 కోట్లు అన్నమాట. అయితే, ఈ ఖర్చు మొత్తం బ్రిటన్‌ ప్రభుత్వమే  చెల్లించనుంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబే లో జరిగే ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని 3.7కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. ఈ కార్యక్రమం కోసం 700 ఏండ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ఓ కుర్చీని కూడా సిద్ధం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events