Namaste NRI

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు

అదివో అల్లదివో అయోధ్య. అక్కడి దివ్య భవ్య నవ్య రామ మందిరంలో త్వరలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరగనుంది. కొన్నేళ్లుగా జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి కావస్తుండడంతో అయోధ్య రామాలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్‌ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అయితే, కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు సాకేత్‌ నిలయంలో సంఘ్‌ పరివార్‌ సమావేశం జరిగింది. వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి ముందుకు తీసుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ఇందులో మొదటి దశ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభం కాగా,  డిసెంబర్‌ 20 వరకు కొనసాగనున్నది. కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికను తయారు చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events