Namaste NRI

ద్రవ్యోల్బణం కట్టడీపైనే తమ దృష్టి

వచ్చే నెలల్లో ఫెడ్‌ పెద్ద మొత్తంలో వడ్డీ రేటు పెంపు ఉండనుందని అమెరికా రిజర్వు చైర్‌ జెరోమ్‌ పావెల్‌ తెలిపింది. రాబోయే నాలుగు దశాబ్దాల్లో అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణం కట్టడీపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. ఫెడ్‌ కఠిన నిర్ణయాల వల్ల రుణాలకు సంబంధించి అనేక కుటుంబాలు, వ్యాపారాలు బాధపడవచ్చని పావెల్‌ అంగీకరించారు. అధిక రేట్లతో ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, ఉపాధి తగ్గవచ్చని అన్నారు.  ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు  పెంచామన్నారు. ధర స్థిరత్వం పునరుద్ధరణలో వైఫల్యం బాధకు దారీ తీస్తుందని అన్నారు. గతంలో రేటు పెంపు నెమ్మదిగా ఉంటుందని చెప్పిన పావెల్‌ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events