Namaste NRI

అమెరికా-భారత్‌ మధ్య ఇదో మైలురాయి.. కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌

  హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్‌ నూతన భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్‌ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వ్యాంలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. 34 కోట్ల డాలర్లతో అత్యాధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించాం. ఈ పెట్టుబడి భారత్‌తో అమెరికాకు ఉన్న  బంధంలో భాగం. కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ వద్ద అమెరికా జెండాను ఎగురవేశాం.. ఈ రోజు ఈ అద్భుతమైన సదుపాయం సాధ్యమయ్యేలా కృషి చేసిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో యూఎస్‌-భారత్‌ భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆమె చెప్పారు. కొత్త కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్టు వెల్లడించారు. కాన్సులేట్‌ కార్యాలయం ఇప్పటివరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కొనసాగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events