Namaste NRI

యూటర్న్ తీసుకున్న ట్రంప్.. భారత్‌-పాక్‌ వార్‌పై  

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటికే పలుసార్లు ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూటర్న్‌ తీసుకున్నారు. భారత్‌, పాక్‌లకు చెందిన ఇద్దరు చాలా తెలివైన నాయకులు గత నెలలో జరిగిన సంఘర్షణను అణు యుద్ధంగా మార్చకుండా ముగించాలని నిర్ణయించుకున్నారని ట్రంప్‌ ప్రశంసించారు. శ్వేత సౌధంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌తో విందు సమావేశం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య మే 7-10 మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. తర్వాత హఠాత్తుగా కాల్పుల విరమణ జరిగింది.

ఈ కాల్పుల విరమణకు తానే కారణమని, రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించి అణుయుద్ధాన్ని నివారించి లక్షలాది మంది ప్రాణాలు కాపాడినట్టు ట్రంప్‌ ఇప్పటికే డజను సార్లకు పైగా బహిరంగంగా ప్రకటించారు. అయితే దానిని భారత్‌ ఖండిస్తూ వచ్చింది.

Social Share Spread Message

Latest News