Namaste NRI

తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో… ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్‌ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ ఉత్సవాల్లో  సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. ఈ పూజ వేడుకను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఎంతో మంది భక్తులు తమ ఇంటి నుండి వీక్షించి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం పొందారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్‌కు చెందిన వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు.    ఈ  పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా  నడికట్ల భాస్కర్,  నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. 

సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త  నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్,  రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్‌లు . .. సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events