Namaste NRI

వాలంటైన్స్ డే రోజు.. ఇస్రో కీలక ప్రయోగం

ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. పీఎస్‌ఎల్వీ సీ `52 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. ఫిబ్రవరి 14న ఉదయం 5:59 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్‌ థావస్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి  ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1.710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్‌`04 శాటిలైట్‌తో పాటు మరో రెండు శాటిలైట్లను పీఎస్‌ఎల్వీ తనతో పాటు నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈఓఎస్‌`04 శాటిలైట్‌ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు.

                        వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్‌, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌లకు సంబంధించి ఈ శాటిలైట్‌ హై క్యాలిటీ ఇమేజెస్‌ను తీసి పంపిస్తుంది. మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటి ఇన్స్పైర్‌ శాట్‌`1. దీన్ని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆప్‌ అట్మాస్పియరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌ తో కలిసి ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తయారు చేసింది.  రెండో చిన్న శాటిలైట్‌ పేరు ఐఎన్‌ఎస్‌`2టీడీ. ఇది ఇండియా`భూటన్‌ జాయింట్‌ శాటిలైట్‌. పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డ్‌ అవ్రూవల్‌ లభించిన తర్వాత 25 గంటల కౌంట్‌ డౌన్‌ ప్రారంభమవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events