Namaste NRI

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంలోని రెండో పాటను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్

 చైతన్య రావు, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని రెండో గీతం ప్రేమ ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. కల్యాణి మాలిక్‌ స్వరపరచిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఇదే వేడుకలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్‌ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శిష్ణా వి ఎమ్‌కె, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఆర్‌.పి.పట్నాయక్‌, నిర్మాతలు: కెకెఆర్‌, బాలరాజ్‌, రచన-దర్శకత్వం: బాల రాజశేఖరుని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events