Namaste NRI

నాతో నేను ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన విజయేంద్రప్రసాద్‌

సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  నాతోనేను. పాపులర్‌ రైటర్ విజయేంద్రప్రసాద్‌ నాతో నేను ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఆ ప్రయాణం సరైన సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది.. అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పోస్టర్‌లో ఓ వైపు సీరియస్‌ లుక్‌లో సాయికుమార్‌, మరోవైపు పిల్లాడు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంతికుమార్‌ తుర్లపాటి కథ, సంభాషణలు, స్క్రీన్‌ ప్లే అందిచడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు. సత్య కశప్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎల్లలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్‌నేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, భద్రమ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events