Namaste NRI

అమెరికాలోని భారత సంతతి వ్యక్తి విశ్వచంద్‌ మృతి

 అమెరికాలోని బోస్టన్‌ విమానాశ్రయంలో కొల్లా విశ్వచంద్‌ దుర్మరణం పాలయ్యాడు. యూఎస్‌లోని బోస్టన్‌ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండగా బస్సు వచ్చి ఢీకొట్టడంతో ఆయన మరణించాడు. 47 ఏళ్ల భారతీయ-అమెరికన్‌ విశ్వచంద్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో ఉద్యోగి అయిన ఆయన మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విజిటింగ్‌ సంగీతకారుడిని పికప్‌ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్మినల్‌ బి దిగువ స్థాయిలో ఉండగా అతన్ని ఒక బస్సు ఢీకొట్టిందని మసాచుసెట్స్‌ స్టేట్‌ పోలీసులు తెలిపారు. డ్యూటీలో లేని నర్సు కొల్లాకు సహాయం చేయడానికి పరుగెత్తారు. అయితే అతను సంఘటనా స్థలంలోనే మరణించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events