అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేశ్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం రాక్షస కావ్యం. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఇటీవలే విడుదలై మంచి టాక్ సంపాదించుకొంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో దర్శకుడు మాట్లాడుతూ మా సినిమాలో స్టార్స్ లేరు. కంటెంట్ని మాత్రమే నమ్ముకొన్నాం. అయినా సరే, ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ విజయం ఊహించలేద న్నారు. వంద థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. స్పందన బాగుండడంతో మరో 30 థియేటర్లు పెంచాం. నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ఈ చిత్రం మంచి పేరు తీసుకొచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాతో తమ కెరీర్ మారిపోయిందని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.