Namaste NRI

వాడు ఎవడు ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేసిన మంత్రి తలసాని

కార్తికేయ, అఖిల నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం వాడు ఎవడు. ఎన్‌.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్‌ చూశా. చాలా బాగుంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘన విజయం అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు. మహిళల అందమైన జీవితాలు సమాజంలోని కొన్ని అసాంఘిక శక్తుల వల్ల ఎలా అర్థంతరంగా ముగుస్తున్నాయో ఇందులో చూపించాం అన్నారు కథా రచయిత రాజేశ్వరి పాణిగ్రహి. చిత్ర దర్శక నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాతో సమాజానికి మంచి సందేశం ఇవ్వనున్నాం. మూడు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ గండ్రకోటి, సంగీతం: ప్రమోద్‌ కుమార్‌, కథ, మటలు, స్క్రీన్‌ప్లే : రాజేశ్వరి పాణిగ్రహి, నిర్మాత, దర్శకత్వం: ఎన్‌.శ్రీనివాస రావు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events