కుటుంబకథా చిత్రాలను వినోదాన్ని జోడిరచి తీయడంలో పేరున్న దర్శకుడు శివనాగేశ్వరరావు తాజాగా దోచేవారెవరురా.. పేరుతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ కథతో ఉంటుంది. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రల్లో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి నటిస్తున్నారు. ఐక్యూ క్రియేషన్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ను ఉగాది సందర్భంగా రామ్గోపాల్ వర్మ ఆవిష్కరించారు. షూటింగ్ జరుగుతోందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.














