ఏప్రిల్ 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యవస్థాపన దినోత్సవాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఆయా దేశాల్లో ఉన్న ఎన్నారై శ్రేణులు కొవిడ్ నిబంధనల మేరకు టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సారి పరిమిత సంఖ్యలో 15 నుంచి 20 దేశాల ప్రతినిధులు హెచ్ఐసీసీలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు.














