Namaste NRI

జాకీర్ హుస్సేన్ ఇక లేరు

 ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73)కన్నుమూశారు. హృద్రోగ సంబంధ సమస్యలతో రెండు వారాలుగా ఆయన అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చగా మరణించారని ఆయన స్నేహితుడు, ఫ్లూటిస్ట్‌ రాకేశ్‌ చౌరాసియా తెలిపారు. మరణించే సమయంలో హుస్సేన్‌ పెద్ద కుమారుడు, తబలా కళాకారుడు అల్లా రఖా తండ్రి వద్దే ఉన్నారు. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్‌ తండ్రి ఉస్తాద్‌ అల్లా రఖా ఖాన్‌ కూడా ప్రముఖ తబలా సంగీతకారుడే. భారత శాస్త్రీయ సంగీతంలో జాకీర్‌ తనదైన ముద్ర వేశారు. తండ్రి వద్దనే సంగీతాన్ని అభ్యసించి ఏడేండ్ల వయసులోనే ఆయన కచేరీలలో తబలా వాయించే వారు. ముంబైలో గ్రాడ్యుయేషన్‌, జాకీర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి సంగీతంలో డాక్టోరల్‌ డిగ్రీని పూర్తి చేశారు.

ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో హుస్సేన్‌ ప్రతిష్టాత్మకమైన ఐదు గ్రామీ అవార్డులు గెల్చుకున్నారు. పలు భారత, అంతర్జాతీయ కళాకారులతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. జాకీర్‌ హుస్సేన్‌ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. 2016లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వైట్‌హౌస్‌కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీతకారుడు హుస్సేనే. ఆయన సేవలకు భారత ప్రభుత్వం1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌, 2023లో పద్మ విభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. హుస్సేన్‌ మృతికి పలువురు సంగీతకారులు, నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events