Skip to main content

Namaste NRI

వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా భారత స్వాతంత్య్ర వేడుకలు

75వ భారత స్వాత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా  అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీ నగరంలో తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించి వినూత్నంగా జరుపుకొన్నారు. జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షులు సాయిసుధ పాలడుగు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలివచ్చి జాతీయ పతకాలు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం క్రీడాపోటీల్లో విజేతకు బహుమతులను ప్రదానం చేశారు.  ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకొని అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Social Share Spread Message

Latest News