Namaste NRI

టీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ షాక్

టీఆర్‌ఎస్‌ తరపున హుజురాబాద్‌ టికెట్‌ ఆశించి పార్టీలో చేరిన కౌషిక్‌ రెడ్డికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేశారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కౌషిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు ఫైల్‌ కూడా పంపించారు. అయితే గవర్నర్‌ తమిళి సై ఆ ఫైల్‌ను హోల్డ్‌లో పెట్టారు. తాజాగా ఆ ఫైల్‌ గురించి తమిళి సై మౌనం వీడారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ కౌషిశ్‌ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  సామాజిక సేవలకు ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే ఎమ్మెల్సీకి నామినేట్‌ చేయడం సరైనదని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని, కౌషిక్‌ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events