భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్హోల్) అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో కి అత్యంత నమ్మకమైన ఈ వాహకనౌక ద్వారా ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహంతోపాటు మరో పది శాటిలైట్ల ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్ నిలిచింది. 2021లో ఐఎక్స్పీఈ పేరుతో నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు.














