కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్స్ను వినియోగిస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఇప్పటికీ మాదకద్రవ్యాల వ్యసనాన్ని మానలేదని తెలుస్తున్నది. దీని వల్ల మస్క్ ఆరోగ్యంతో పాటు ఆయన వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతున్నదని ఆ సంస్థల డైరెక్టర్ల బోర్డు సభ్యులు ఆందోళ న చెందుతున్నట్టు తెలిసింది. కెటామైన్ లాంటి సైకెడెలిక్ డ్రగ్ను వాడేందుకు ప్రిస్క్రిప్షన్ను కలిగి ఉన్నట్టు స్వయంగా చెప్తున్న ఎలాన్ మస్క్ గతంలో బహిరంగంగానే మారిజువానాను సేవించిన ఉదంతాలు న్నాయి. 2017లో ఓ ఈవెంట్కు ఆలస్యంగా వచ్చిన మస్క్, మాదకద్రవ్యాల మత్తులో బూతులు మాట్లాడారు. అనంత రం పలు సందర్భాల్లో కూడా మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.














