Namaste NRI

అమెరికాలో ప్రమాదం … ముగ్గురు భారత విద్యార్థులు మృతి

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ-అమెరికన్‌ విద్యార్థులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్ఫారెట్టా నగరంలో వేగంగా వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అందరూ 18 ఏండ్ల వయసు గల వారు కావడం గమనార్హం. మృతిచెందిన విద్యార్థులను శ్రియా అవసరాల, ఆర్యన్‌ జోషి, అన్వి శర్మలుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రిత్విక్‌ సోమేపల్లి, మహ్మద్‌ లియాకత్‌ గాయపడ్డారు. బాధిత విద్యార్థులు అల్ఫారెట్టా హైస్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాలో చదువుకొంటున్నారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events