Namaste NRI

యాక్షన్‌ చేయడం సవాల్‌గా అనిపించింది: ఫరియా అబ్దుల్లా

ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న చిత్రం మత్తు వదలరా-2. శ్రీసింహా కోడూరి హీరోగా, రితేష్‌ రానా దర్శకత్వం. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పాత్రికేయులతో ముచ్చటిస్తూ ఇదొక థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌. కథలోని విషాదం నుంచే కామెడీ పుడుతుంది. శ్రీసింహా తొలిభాగంలో డెలివరీ బాయ్‌గా కనిపించగా, ఈ సీక్వెల్‌లో స్పెషల్‌ ఏజెంట్‌గా కనిపిస్తారు. సినిమాలో నా పాత్ర పేరు సన్నిధి. తను కూడా స్పెషల్‌ ఏజెంట్‌ అని చెప్పింది. ఈ సినిమాలో తాను యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించానని, గన్స్‌ పట్టుకొని పోరాటాలు చేయడం కొత్త అనుభూతినిచ్చిందని, అలాగే ఓ పాటను రాసి పాడానని ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఈ టీమ్‌ అన్ని అంశాల్లో నన్ను ఎంకరేజ్‌ చేసింది. మళ్లీ వారితో పనిచేయాలనుంది అని ఆమె పేర్కొంది. ప్రస్తుత తెలుగులో తిరువీర్‌తో కలిసి ఓ లవ్‌స్టోరీలో నటిస్తున్నానని, త్వరలో ఓ తమిళ చిత్రం కూడా ప్రారంభం కాబోతుందని ఫరియా అబ్దుల్లా తెలిపింది. ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events