అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం పై ఖలిస్తానీ మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. నివార్క్లోని స్వామినారాయణ్ మందిరం గోడలపై ఆ గ్రాఫిటీ వేశారు. ఈ ఘటన పట్ల సమగ్ర విచారణ చేపడుతామని నివార్క్ పోలీసులు తెలిపారు. ఆలయం గోడలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ప్రజలను భయపెట్టేందుకు గోడలపై విద్వేషపూరిత రాతలు రాసినట్లు హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొన్నది. నివార్క్ పోలీసుల ఈ ఘటనపై కేసును ఫైల్ చేశారు. విద్వేష నేరంగా ఈ ఘటనను దర్యాప్తు చేయాలని ఆ ఫౌండేషన్ కోరింది.