Namaste NRI

భారత్‌కు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌.. నాలుగు బిలియన్‌ డాలర్లతో

నాలుగు బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్‌కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన సర్టిఫికేషన్‌ను డిఫెన్స్‌ సెక్యూరిటీ కో-ఆపరేషన్‌ ఏజన్సీ సమకూర్చింది. దీంతో విక్రయాలు జరగవచ్చునని యూఎస్‌ కాంగ్రెస్‌ తెలిపింది. గత ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు ప్రతిపాదించింది. రిమోట్‌తో నడిపే ఈ సాయుధ డ్రోన్లతో సముద్ర మార్గాలలో మానవ రహిత నిఘా, పెట్రోలింగ్‌ను పెంచుతుందని, గగనతల నిఘా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events