అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో మరోమార్పునకు శ్రీకారం చుట్టారు. ప్రతిశుక్రవారం ఫెయిత్హౌస్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి టెలిఇవాజలిస్ట్ పౌలా వైట్ నాయకత్వం వహించాలని పేర్కొన్నారు. ఆమెను ట్రంప్కు ఆధ్యాత్మిక సలహాదారుగా భావిస్తుంటారు. అంతకు ముందు రోజే అటార్నీజనరల్ పామ్బోండీ నేతృత్వంలో పనిచేసేందుకు ఓ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేశారు. అమెరికా క్రిస్టియన్లపై వేధింపులు లేకుండా చేసేందుకు ఇది పనిచేస్తుంది. ఇవాంజ్లికల్ క్రిస్టియన్లు ట్రంప్కు 2024 ఎన్నికల్లో బలమైన మద్దతుదార్లుగా వ్యవహరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)