
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. ఈరోజు (మంగళవారం) జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 రేసులో పారా అథ్లెట్ దీప్తి 55.82 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఈ రేసులో దీప్తి జీవన్జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పతకంతో పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య (స్వర్ణ3, రజత5, కాంస్యం*8) 16కు చేరింది. కాగా ఈ పోటీలో 55.16 సెకన్లతో అగ్రస్థానంలో నిలిచిన యూలియా షుల్యార్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. మరోవైపు టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ (55.23) రజతం సాధించింది.
