తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కజకిస్తాన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ ఫోరమ్ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. కజకిస్తాన్ వేదికగా జరిగే 2022 డిజిటల్ బ్రిడ్జి ఫోరమ్ సదస్సు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. బిగ్ డేటా, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ సేవలపై సదస్సు నిర్వహించనున్నారు.