సన్నీ నవీన్, రోహిణి రేచల్ జంటగా నటించిన చిత్రం జైత్ర. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లం శ్రీతన్మయి సమర్పణలో అల్లం సుభాష్ నిర్మించారు. అధర నా గుండెల ధర అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ సినిమాలు చూశాం. అయితే ఒక రైతు కథతో రూపొందిన ఈ చిత్రం జైత్ర. సాంగ్స్, టీజర్ బాగున్నాయి. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మల్లికార్జున మాట్లాడుతూ మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల చేయనున్నాం అన్నారు. వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్, కెమెరా: మోహన్ చారి.














