Namaste NRI

గుజరాత్‌ను బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సందర్శించారు. వడోదర సమీపంలోని బ్రిటన్‌కు చెందిన జేసీబీ ఫ్యాక్టరీకి సీఎం భూపేంద్ర పాటిల్‌తో కలిసి ఆయన వెళ్లారు. కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా బుల్డోజర్‌పైకి ఎక్కి సందడి చేశారు.

భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణె స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్మీలో అత్యున్నత పదవిని తొలిసారి ఒక ఇంజినీర్‌ చేపట్టనుండటం విశేషం.

వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్య రథోత్సవాన్ని నిర్వహించారు.  భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు సీజేకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్‌ ప్రభు, టీజీ వెంకటేశ్‌, సుజనా చౌదరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఉపరాష్ట్రపతి వారిసేవలను అభినందించారు