ధనుష్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ను అక్కినేని నాగార్జున, వెంకటేశ్ లాంఛ్ చేశారు. ట్రైలర్ తెల్లదొరలంతా దొంగలు అనే డైలాగ్స్తో షురూ అయింది. నీలాగా నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే, వాడిని నేనే చంపేవాడిని, ప్రియాంక మోహన్ చెబుతున్న సంభాషణలతో సాగుతున్న ట్రైలర్.. తెల్లదొరలకు వ్యతిరేకంగా కెప్టెన్ మిల్లర్ అండ్ టీం ఎలా పోరాడిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తెలుగులో ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్గా విడుదల చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ , టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ ఇప్పటికే తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్లో తన సత్తా చాటుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలై కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.