అమెరికాలోని హ్యూస్టన్ లో నిర్మిస్తున్న ఎటర్నల్ గాంధీ మ్యూజియానికి (ఈజీఎంహెచ్) ఫోర్ట్ బెంట్ కౌంటీ 457 వేల డాలర్లు (రూ.3.44 కోట్లు) విరాళంగా ఇచ్చింది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రచారం చేయడానికి ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చాలా వరకు ఈ నిధులు దోహదపడనున్నాయి. ఈ మ్యూజియం పనులకు గత జులైలో శంకుస్థాపన జరగగా, 2023లో పూర్తికానున్నాయి. మూడెకరాల స్థలంలో మొత్తం దాదాపు రూ.50 కోట్ల (6.5 మిలియన్ డాలర్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.














