గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఏ. హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్, మాళవిక శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా లోని ఏదో ఏదో మాయ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. రవి బస్రూర్ స్వరపరచిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్నందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రేమించిన అమ్మాయి పట్ల కథానాయకుడి ఆరాధనను ఆవిష్కరిస్తూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. నాయకానాయికలు గోపీచంద్, మాళవిక మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: స్వామి జె గౌడ, సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: అజ్జూ మహంకాళి, దర్శకత్వం: ఏ.హర్ష.
