కరోనా పరిస్థితుల వల్ల ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన గుడ్లక్ సఖి ఎట్టకేవలకు విడుదలకు సిద్ధమైంది. కీర్తీ సురేష్ కథానాయికగా నటించిన గుడ్ లక్ సఖి చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్ను అభిమానులతో పంచుకుంది. ఆ పోస్టర్లో కీర్తి విల్లు ఎక్కు పెట్టి చిరునవ్వులు చిందిస్తూ క్యూట్గా కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. కీర్తి సురేష్ షూటర్గా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్Ñ సహ నిర్మాత : శ్రావ్య వర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)