
ప్రవాస భారతీయుడికి గల్ఫ్ లాటరీలో జాక్పాట్ తగిలింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్లో షార్జాలో నివసిస్తున్న విబీష్ పల్లియాల్ అనే వ్యక్తి 15 మిలియన్ దిర్హామ్లు (దాదాపు రూ.37.5 కోట్లు) గెలుచుకున్నారు. ఫిబ్రవరి 28న ఆయన టికెట్ కొనుగోలు చేసినట్టు సమాచారం. మార్చి 3న డ్రా తీయాల్సి ఉన్నా, యుద్ధ పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో దీనిని ఒకరోజు వాయిదా వేసిన నిర్వాహకులు విజేతలను ప్రకటించారు. లక్కీ విజేత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.















