రెండురోజులపాటు జరుగనున్న జీ20 సదస్సుకు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్నది. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరిగే సదస్సు కోసం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలువురు దేశాధినేతలు భారత్ చేరుకున్నారు. ఈ సదర్భంగా ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.














