Namaste NRI

ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు జైలు శిక్ష

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు నాంపల్లి స్పెషల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా రైల్‌ రోకోలో పాల్గొన్న కేసుకు సంబంధించి ఆయనపై నేరం రుజువైనట్లు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తెలిపింది. ఈ కేసులో వినయ్‌ భాస్కర్‌ సహా 18 మందికి న్యాయస్థానం రూ.3 వేలు జరిమానా విధించింది. అయితే, దాస్యం వినయ్‌ భాస్కర్‌ అభ్యర్థన మేరకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో కాజీపేట వద్ద రైలురోకో సందర్భంగా ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా టీఆర్‌ఎస్‌ తరపున దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రస్తుతం వరంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events