మిసెస్ వరల్డ్ `2022 కిరీటం భారత్కు దక్కింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొన్నారు. పెండ్లి అయిన వారికి నిర్వహించే అందాల పోటీలనే మిసెస్ వరల్డ్ పోటీలు అంటారు.














