Namaste NRI

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి హాజరైన ఎన్నారైలు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో టీఆర్‌ఎస్‌ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒమన్‌, జర్మనీ, చైనా, ఫిలిప్పీన్స్‌, ఖతార్‌, నార్వే, జాంబియా,  మారిషన్‌, టాంజానియా,  దక్షిణాఫ్రికా, మలేషియా,  బహ్రెయిన్‌, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ, యూకే తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News