అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్షైర్లోని కాంకర్డ్లో ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దవాఖాన సమీపంలో దుండగుడు వినియోగించిన వాహనాన్ని గుర్తించామన్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని హాంప్షైర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. కాగా, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారి పరిస్థితి ఎలా ఉందనే విషయమై సరైన సమాచారం లేదన్నారు. పోలీసుల కాల్పుల్లో అనుమనితుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.














