విశాఖపట్నం సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

INS సుమేధా నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతి భారత నౌకాదళం మరియు మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్మరైన్లను సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.


“United Through Oceans” అనే థీమ్తో జరిగిన IFR 2026 భారత్ సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాల్గొనడం గర్వకారణం, ఇది ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీకగా నిలిచింది.

అంతర్జాతీయ నావికాదళాల భాగస్వామ్యం ఇండో-పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం మరియు శాంతి పట్ల సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించింది. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతున్న శక్తికి ఇది గొప్ప నిదర్శనం.
















