ప్రముఖ భరతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త నిఖిల్ శ్రీవాస్తవకు అరుదైన అవార్డు దక్కింది. 1959 నాటి గణితశాస్త్ర సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న నేపథ్యంలో శ్రీవాస్తకు సిప్రియాన్ ఫోయాస్ ప్రైజ్కు ఎంపికయ్యారు. అపరేటర్ థియేరీలో అమెరికన్ మాథ్యమటికల్ సొసైటీ ఈ అవార్డును అందజేయనుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా యూనివర్సిటీలో నిఖిల్ శ్రీవాస్తవ భోధన వృత్తిలో ఉన్నారు. సిప్రియాన్ అవార్డును గెలిచిన వారిలో నిఖిల్తో పాటు ఆడమ్ మార్కస్, డానియల్ స్పిల్మ్యాన్ ముగ్గురికి కలిసి ఈ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. అవార్డులో భాగంగా వీరికి రూ.3.76 లక్షలు ( 5,000 డాలర్లు) లభించనున్నాయి.
వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్టు అమెరికన్ మాథ్యమటికల్ సొసైటీ తెలిపింది. గణితశాస్త్రంలో నిఖిల్ శ్రీవాస్తవ ప్రైజ్లు గెలవడం చాలా కామన్. ఆ రంగంలో ఆయనకు ఇది మూడో అతిపెద్ద అవార్డు. గతంలో 2014లో జార్జ్ పోలియా ప్రైజ్, 2021లో హెల్డ్ ప్రైజ్లను కూడా నిఖిల్ గెలుచుకున్నారు. ఆపరేటర్ థియరీలో రిచర్డ్ కడిసన్, ఇసడోర్ సింగర్ 1959 విసిరిన ప్రశ్నకు నిఖిల్ పరిష్కారాన్ని కనుగొన్నాడు.