ఏక్భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని సంక్రాంతి పండుగ ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాశీ`తమిళ్, సౌరాష్ట్ర`తమిళ్ సంగమాల్లో ఇదే భావన కనిపిస్తుందని చెప్పారు. మకర సంక్రాంతి (పొంగల్)ని పురస్కరించుకుని ఢల్లీిలో కేంద్ర మంత్రి ఎల్.మురుగున్ నివాసంలో జరిగిన వేడుకలకు ప్రధాని సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తమిళనాడులో ప్రతిఇంటా ఈ పండుగ సందడి కనిపిస్తుందని చెప్పారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు, సుసంపన్నత వెల్లివిరియాలని ఆకాంక్షించారు.














