Namaste NRI

రియల్ దండుపాళ్యం ట్రైలర్ లాంచ్…

రాగిణి ద్వివేది, మేఘన రాజ్‌ ప్రధాన పాత్రల్లో మహేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రియల్‌ దండుపాళ్యం. రామ్‌ ధన్‌ మీడియా వర్క్స్‌ సమర్పణలో శ్రీ వైష్ణోదేవి పతాకంపై సి.పుట్టస్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలువుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత సురేష్‌ కొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ దండుపాళ్యం సిరీస్‌ తెలుగు, కన్నడ భాషల్లో ఎంత ఆదరణ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికీ మించేలా రియల్‌ దండుపాళ్యం ఉండనుంది. మగాళ్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ చిత్రం. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్ట్‌గా తెరకెక్కించారు దర్శకుడు మహేష్‌. ఈ చిత్రం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత : కోయల్‌ బంజార.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events