అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మణం పాలయ్యారు. మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. యూనియన్ కౌంటిలోని ఇల్లినాయిస్ రూట్ నెం. 3 దగ్గర రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇల్లినాయిస్ యూనివర్సిటీ కార్బన్డోల్లో చదువుకుంటున్నారు. వంశీకృష్ణ పెచ్చెట్టి నగరంలోని నిజాంపేటకు చెందినవారు. వంశీకృష్ణ మరణ వార్త వినగానే రెడ్డి రెవిన్యూలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన మరో విద్యార్థి పవన్ స్వర్ణ స్వస్థలం ఖమ్మం. కల్యాణ్ ద్రోణ, కార్తిక్ కాకుమాను, యశ్వంత్ ఉప్పలపాటి గాయపడిన వారిలో వున్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల మృతికి యూనివర్సిటీ కూడా సంతాపం తెలిపింది.














