వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సైంధవ్ . శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ైక్లెమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. 16రోజుల్లో ైక్లెమాక్స్ను పూర్తి చేశాం. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కించాం. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వ్యయంతో రూపొందించిన ైక్లెమాక్స్ ఇది. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. అసాంఘిక శక్తులపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)