Namaste NRI

తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో… చంద్రబాబుకు సంఫీుభావంగా

తెలుగుదేశం  పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీ స్ట్రాత్‌ ఫీల్డ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అక్కడి నుంచి హెలెన్స్‌బెర్గ్‌ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపుగా 48. కి.మీ పాదయాత్రగా వెళ్లి చంద్రబాబు గోత్రనామాలతో పూజలు చేశారు. తెలుగువారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన దార్శనికుడు చంద్రబాబు  అని, అటువంటి నాయకుడిని అక్రమ కేసులతో నెల రోజులుగా జైలులో నిర్బంధించటం దారుణమన్నారు. ఆయనకు సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహించినట్లు వారు తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి  చేయటం చేతకాని సీఎం జగన్‌ ఇలా దొడ్డిదారిలో ప్రతిపక్షాల నోరునొక్కటం ద్వారా మరోసారి గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా విజయం సాధించి గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలెక్కించాలని భగవంతుల్ని ప్రార్థించినట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events