హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా బ్యాండ్ మేళం. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 26న శ్రీరామనవమి కానుకగా విడుదల కానున్నది. ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ఈ కథ వినగానే రోషన్, శ్రీదేవి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. ఈ సినిమా తర్వాత ఈ జంటను వెతుక్కుంటూ కథలు వస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ మనసుల్ని కదిలిస్తుంది. నా కుమార్తెలు కావ్య, శ్రావ్య ఈ సినిమాతో నిర్మాతలుగా మారారు. తప్పక విజయం సాధిస్తారని నమ్మకంతో ఉన్నా అని అశాభావం వెలిబుచ్చారు.

ఇది ఎమోషనల్ మూవీ అనీ, సాంకేతికంగా అన్ని విభాగాలూ ప్రాణం పెట్టి పనిచేశాయని, క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందని దర్శకుడు సతీష్ జవ్వాజి చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు హర్ష్ రోషన్, శ్రీదేవి ఆనందం వెలిబుచ్చారు.















