Namaste NRI

400ఏళ్ల నాటి గుడి రహస్యం?

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. ఈ చిత్రానికి దీనికి లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మూన్‌షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై మహేష్‌ చందు నిర్మిస్తున్నారు. 400 ఏళ్లనాటి గుడి నేపథ్యంలో నడిచే థ్రిల్లర్‌ కథాంశమిది. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపిస్తాడు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఉన్నతస్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. నేటి నుంచి రెండో షెడ్యూల్‌ మొదలుపెడతాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, సమర్పణ: శివన్‌ రామకృష్ణ, రచన-దర్శకత్వం: లుధీర్‌ బైరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events