Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా స్టేట్‌లోని ఓ మాల్‌లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.  ఇండియానాలోని గ్రీన్‌ఉడ్‌ పార్క్‌లో మాల్‌లో ఉన్న ఫుడ్‌కోర్టులోకి చొరబడిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామని పోలీసులు వెల్లడిరచారు.  కాగా ఓ పౌరుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడని తెలిపారు.  అమెరికాలో కాల్పులు సర్వ సాధారణమైంది. ఏడాది కాలంలో సుమారు 40 వేల మందికి పైగా తుపాకీ కాల్పుల్లో మృతి చెందారని అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events